మన హృదయాలకు‘నెమ్మి నీలం’ అద్దుకుందాం!

మిళ రచయిత జయమోహన్ (జెయమోహన్ అనాలా?) పన్నెండు కథల సంపుటం ‘నెమ్మి నీలం’ చదవడం ఒక అపురూపమైన, ఉత్తేజకరమైన, ఆలోచనాస్ఫోరకమైన, ఏకకాలంలో విషాద బీభత్స హాస్య కరుణా స్పందనలు కలిగించగల అద్భుత అనుభవం. ఆ పఠన అనుభవం నుంచి, ఆ అనుభవం తర్వాత చెలరేగే ఆలోచనల సుడిగుండాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ కథాస్థలాల నుంచి, ఆ సన్నివేశాల నుంచి, ఆ పాత్రల నుంచి, ఆ సంభాషణల నుంచి, వాటి ప్రభావం నుంచి బైటపడడం చాల […]

‘నెమ్మి నీలం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ శానభాగ

వేదికపై వసుధేంద్ర, మృణాళిని, పుస్తక రచయిత జయమోహన్, అనువాదకుడు అవినేని భాస్కర్, ఛాయ ఎడిటర్ అరుణాంక్ లత బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు. ఐదు వేదికల ద్వారా 50కి పైగా చర్చాగోష్టులు, పుస్తకావిష్కరణలు నిర్వహించారు. పలు సమీక్షల్లో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీని వాస్ భాగస్వాములయ్యారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మళయాళ భాషల ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. చివరిరోజు ఆదివారం […]

Nemmi Neelam Book Launch || Video

నేను తెలుగు పాఠకుల్ని కోరేది ఒక్కటే. ఒక పుస్తకాన్ని మీకోసం, మరొక పుస్తకాన్ని మీ స్నేహితుల కోసం కొనండి. – వివేక్ శానభాగ నేనొక్కటే చెబుతాను. మీరీ పుస్తకాన్ని చదవకపోయినట్లైతే, చాలా మిస్ అవుతారు. ఈ పుస్తకాన్ని కొనండి. వెంటనే చదవండి. – వసుధేంద్ర

వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత పోర్చుగీసు ప్రజలు, లిస్బన్ నగరవాసులు మనదేశం నుంచి సుగంధద్రవ్యాలు తీసుకొని వెళ్ళి యూరోప్ లో అమ్మి బాగా డబ్బు గడించే వారు. “తేజో తుంగ” నవల కథ పోర్చుగీసు రాజధాని లిస్బన్ లో, మనదేశంలోని విజయనగర సామ్రాజ్యంలోని తెంబకపురంలో జరుగుతుంది. రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతాయి. లిస్బన్లో గాబ్రియల్ అనే Christian యువకుడు ఇసబెల్లా అనే యూదు యువతిని ప్రేమిస్తాడు. ఆమె ధనవంతుని బిడ్డ, ఆతను పేద యువకుడు. […]